Posted on 2026-01-31 14:03:33
ప్రమాద సమయంలో బస్సులోనే విద్యార్థులు.. తప్పిన పెను ప్రమాదం
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నవీపేట్ మండలంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. స్టేషన్ ఏరియా సమీపంలో ఆదర్శ స్కూల్ బస్సులో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో బస్సులో దాదాపు 50 మంది విద్యార్థులు ఉండటంతో అందరూ తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే, బస్సు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి వెంటనే మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తూనే, విద్యార్థులందరినీ సురక్షితంగా బస్సు కిందకు దింపడంతో పెను ముప్పు తప్పింది. ఫిట్నెస్ లేని బస్సులను రోడ్లపైకి అనుమతించడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, ఆర్టీఏ అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం కూడా తేటతెల్లమవుతుంది. ఇదే విద్యాసంవత్సరంలో జిల్లాలో ఇలాంటి స్కూల్ బస్సుల ప్రమాదాల ఘటనలు తరచుగా ఎక్కడో ఓ చోట జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు సదరు పాఠశాల యాజమాన్యాలపై చర్యలు తీసుకోకపోవడం పట్ల తీవ్ర విమర్శలు. మరోపక్క విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పాఠశాల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
సామాన్యుడికి భారీ ఊరట... యూపీఐ లావాదేవీలు ఎప్పటికీ ఉచితమే...
Posted On 2026-08-11 07:54:33
Readmore >
తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్సభలో ఆమోదం
Posted On 2026-08-10 18:11:45
Readmore >
సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం
Posted On 2026-08-10 17:34:03
Readmore >
వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్కు
Posted On 2026-08-10 15:38:38
Readmore >
ఖమ్మం : ఆర్ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..
Posted On 2026-08-10 14:43:33
Readmore >
కామారెడ్డి : తిర్మాన్పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్
Posted On 2026-08-10 14:24:49
Readmore >