Posted on 2026-01-08 21:02:08
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దోపిడీకి పాల్పడిన ఒక ఆటో డ్రైవర్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు బాలానగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ (డీఐ) సక్రమ్ తెలిపారు. వృద్ధుడైన సెక్యూరిటీ గార్డును భయపెట్టి, తీవ్రంగా కొట్టి అతడి వద్ద ఉన్న వస్తువులను దోచుకున్నట్లు ఆయన వివరించారు.ఈ నెల 6వ తేదీన బాలానగర్, గౌతమ్ నగర్కు చెందిన రచ్చన్న (60) అనే సెక్యూరిటీ గార్డు, మంగళవారం ఉదయం నర్సాపూర్ చౌరస్తా నుంచి సనత్ నగర్ రైల్వేస్టేషన్కు వెళ్లడానికి ఆటో ఎక్కారు. ఈ సమయంలో, సోమల మల్లికార్జున్ అనే ఆటో డ్రైవర్ అతడిని తన ఆటోలో ఎక్కించుకున్నాడు.బాలానగర్ పరిధిలోని వరుణ్ మోటార్స్ సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలోకి వెళ్లగానే, నిందితుడైన ఆటో డ్రైవర్ ఒక్కసారిగా ఆటోను ఆపాడు. రచ్చన్నను భయభ్రాంతులకు గురిచేసి, అతడి వద్ద ఉన్న రూ. 300 నగదు, సెల్ ఫోన్ను బలవంతంగా లాక్కున్నాడు. అడ్డుకోబోయిన రచ్చన్నను అత్యంత క్రూరంగా కొట్టడంతో అతడికి తీవ్ర రక్తస్రావమైంది. అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు.దీంతో బాధితుడు రచ్చన్న బాలానగర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సాంకేతిక ఆధారాల సహాయంతో ఆటో డ్రైవర్ సోమల మల్లికార్జున్ను బుధవారం అదుపులోకి తీసుకున్నారు. అతడిని అరెస్టు చేసి, న్యాయస్థానం ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించినట్లు డీఐ సక్రమ్ తెలిపారు.
అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్
Posted On 2026-06-17 13:12:03
Readmore >
గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-17 08:58:29
Readmore >
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >