Posted on 2026-01-08 20:58:29
అధ్యక్షురాలిగా కవిత, ఉపాధ్యక్షురాలిగా రూపా
మహిళలు కోటీశ్వరులుగా ఎదగాలి
మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి.
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి పట్టణంలో పట్టణ సమైక్య నూతన కార్యవర్గ ఎన్నికలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ సమాఖ్యల నుంచి వచ్చిన అధ్యక్షులు, కార్యదర్శులు ఎన్నికల్లో పాల్గొన్నారు.
ఈ ఎన్నికల్లో కవితను అధ్యక్షురాలిగా, రూపాను ఉపాధ్యక్షురాలిగా, మంజులను కార్యదర్శిగా, పద్మను కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు అభినందించారు.
ఈ కార్యక్రమంలో మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి, టీఎంసీ రవిశంకర్, సీఓ అనసూయతో పాటు వివిధ సమాఖ్యల అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, మహిళా సంఘాలు తప్పనిసరిగా పంచసూత్రాలను పాటించాలని సూచించారు. రుణాలు తీసుకున్న మహిళలు వాటిని సకాలంలో తిరిగి చెల్లించాలన్నారు. అలాగే ఆదాయాభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించి, స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా బలపడాలని మహిళలకు పిలుపునిచ్చారు. మహిళలందరూ సంఘటితంగా పనిచేస్తే కుటుంబాలే కాక సమాజం మొత్తం అభివృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు.
నూతన కార్యవర్గం మహిళల సంక్షేమం, ఆర్థిక సాధికారత కోసం కృషి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చింది.
అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్
Posted On 2026-06-17 13:12:03
Readmore >
గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-17 08:58:29
Readmore >
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >