Posted on 2026-01-07 16:06:44
తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు మ్యాడారం హరికృష్ణ,ప్రధాన కార్యదర్శి హరేందర్ రెడ్డి
డైలీ భారత్, సిరిసిల్ల: 317 జీఓ కారణంగా అనేక మంది ఉద్యోగ ఉపాధ్యాయులు తమ స్థానికతను కోల్పోయి స్వంత గ్రామాలు,స్వంత జిల్లాలను వదిలి,దూర ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నారు.ఆర్థిక భారం,మానసిక ఒత్తిడి,పిల్లల భాద్యతలు,వృద్ధ తల్లిదండ్రుల రక్షణ,వంటి అనేక సమస్యలతో సతమవుతూ పనిచేస్తున్నారు. నేటితో 317 జీఓ అమలు అయి 4 సంవత్సరాలయింది 4 ఏళ్లుగా విజ్ఞప్తులు, నిరసనలు,వినతులు,ధర్నాలు ఎన్ని చేసిన ఉపశమన చర్యలు ఆశించినంత మేరలో రాలేదు.దీని కోసం ఏర్పాటు చేసిన కాబినెట్ సబ్ కమిటీ చేసిన సిఫారసు మేరకు వెలువడిన 190 జీఓ వచ్చి 4 నెలలు అయింది.అర్హత ఉన్న వాళ్ళు దరఖాస్తు చేసుకొని 4నెలలు అయింది కాబట్టి వెంటనే 190 జీఓ ను అమలు పరచి ఉద్యోగ ఉపాధ్యాయులకి తాత్కాలిక డెప్యూటేషన్ లు కలిపించాలని కోరారు..అవసరం అయితే సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించి అందరికి న్యాయం చేయాలన్నారు.సమావేశంలో ప్రధాన కార్యదర్శి k హరేందర్ రెడ్డి,రాష్ట్ర ఉపాధ్యక్షులు p సత్యనారాయణ, శిరోమణి,సరోజ,s రమేష్, వెంకటరమణ పాల్గొన్నారు...
ట్రాఫిక్ రూల్స్ పై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలి : జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-13 21:33:35
Readmore >
నిషేధిత ఆల్ప్రాజోలామ్ అక్రమ రవాణా భగ్నం – 101 గ్రాముల స్వాధీనం
Posted On 2026-04-13 20:40:46
Readmore >
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు సమాజంలో ప్రతి ఒక్కరికీ మార్గదర్శకం కావాలి : దోర్నాల ప్రవీణ్ కుమార్
Posted On 2026-04-13 20:38:38
Readmore >
రోడ్డు భద్రత – సురక్షితమైన ప్రయాణం ప్రతి ఒక్కరి బాధ్యత : డిఎస్పీ నాగేంద్రచారి
Posted On 2026-04-13 19:58:53
Readmore >
ఎస్.ఆర్ నగర్ పోలీసుల కృషి.... పోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదు
Posted On 2026-04-13 19:09:44
Readmore >