| Daily భారత్
Logo




జిల్లా పోలీసు కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ పరిశీలించిన జిల్లా ఎస్పీ

News

Posted on 2026-01-06 19:07:16

Share: Share


జిల్లా పోలీసు కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ పరిశీలించిన జిల్లా ఎస్పీ

సీసీ కెమెరాల ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనలపై ఈ-చాలన్ విధింపు

నేరాలను నియంత్రించడంలో, నిందితులను గుర్తించడంలో సీసీ కెమెరాల పాత్ర కీలకం

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రజల సహకారం అవసరం 

 డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్‌ను జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్ సందర్శించి, సిబ్బంది ద్వారా ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన వాహనదారులపై ఏ విధంగా ఈ-చాలన్లు విధిస్తున్నారో వివరాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, జిల్లాలో నేరాల నియంత్రణ కోసం వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలన్నింటిని జిల్లా పోలీసు కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానం చేయడం జరిగిందన్నారు. ఈ కమాండ్ కంట్రోల్ ద్వారా ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన వారిని గుర్తించి, ఈ-చాలన్ల ద్వారా జరిమానాలు విధించడం జరుగుతుందని తెలిపారు.

సీసీ కెమెరాలు నేరాల నియంత్రణలోనే కాకుండా నిందితుల గుర్తింపులో కీలక పాత్ర పోషిస్తున్నాయని ఎస్పీ గారు పేర్కొన్నారు. జిల్లా ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం సేవించి వాహనాలు నడపరాదని, మైనర్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్ చేయరాదని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

లైసెన్స్ లేకుండా, నంబర్ ప్లేట్ సక్రమంగా లేకుండా, నంబర్ ట్యాంపరింగ్ చేసిన లేదా నంబర్ తుడిపివేసిన వాహనాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, పట్టుబడిన వాహనాలపై సంబంధిత పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.

రోడ్డు ప్రమాదాలు, మరణాలు మరియు క్షతగాత్రుల సంఖ్యను తగ్గించే చర్యల్లో భాగంగా, గౌరవ ఉన్నత న్యాయస్థానాలు మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జాతీయ రహదారి NH-44 (బిక్కనూర్ నుంచి దగ్గి అటవీ ప్రాంతం – కామారెడ్డి జిల్లా పరిధిలో) వేగ పరిమితిని 80 కిలోమీటర్లుగా నిర్ణయించినట్లు తెలిపారు. పరిమితికి మించి వేగంగా వాహనాలు నడిపితే తప్పనిసరిగా జరిమానాలు విధించబడతాయని స్పష్టం చేశారు

ఇకపై ప్రతి వాహనదారుడు స్వచ్ఛందంగా రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తూ, వేగ పరిమితిని మించకుండా ప్రయాణించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరాలని కోరారు. ఇలా చేయడం ద్వారా తమతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడిన వారమవుతామని జిల్లా ఎస్పీ తెలియజేశారు.

Image 1

"సిరిసిల్ల లో" టిఆర్ఎస్ "జండా పండగ... కొన్ని ఆసక్తికర పరిణామాలు

Posted On 2026-06-19 08:33:46

Readmore >
Image 1

అరవల్లి SI ఈట సైదులు సస్పెండ్

Posted On 2026-06-19 08:09:23

Readmore >
Image 1

శరణార్థుల కన్నీటి గాథ మరిచిన లోకం : మంజుల పత్తిపాటి

Posted On 2026-06-19 08:06:56

Readmore >
Image 1

"మెట్" టెండర్లలో అవకతవకలు అవాస్తవం

Posted On 2026-06-18 21:07:59

Readmore >
Image 1

మ‌హిళ గ్యాంగ్ రేప్‌.. మ‌ర్మాంగంలో బుల్లెట్

Posted On 2026-06-18 20:54:39

Readmore >
Image 1

అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం

Posted On 2026-06-18 20:52:31

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-06-18 20:47:25

Readmore >
Image 1

స్కూళ్ల మూసివేత నిర్ణయాన్నివెనక్కి తీసుకోవాలి

Posted On 2026-06-18 20:45:05

Readmore >
Image 1

ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలి తపస్ నాయకుల వినతిపత్రం

Posted On 2026-06-18 20:43:25

Readmore >
Image 1

హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా నిర్మాణాలు చేపడితే తగిన బుద్ధి చెబుతాం : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-18 18:24:01

Readmore >