Posted on 2026-01-04 14:11:31
బస్టాండ్ల అభివృద్ధికి ముందుకొచ్చిన ఉప్పల్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అరుణ్ పటేల్
డైలీ భారత్, రాంనగర్:ప్రజల విజ్ఞప్తి మేరకు ఉప్పల్ నియోజకవర్గం యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఆకారపు అరుణ్ పటేల్ తన స్వంత ఖర్చులతో పలు కాలనీల బస్టాండ్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. తన మాతృమూర్తి (అమ్మమ్మ) స్వర్గీయ బిళ్ళకంటి ఆండాలు జ్ఞాపకార్థం, ప్రయాణికుల సౌకర్యార్థం 15 బస్సు టైమింగ్ బోర్డులు, 15 సిమెంట్ కుర్చీలను ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకులు మందమూళ్ళ పరమేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా రామ్ రెడ్డి నగర్, కామాక్షిపురం, సత్య నగర్, శ్రీనగర్ కాలనీ మరియు సాయి కృష్ణ నగర్ కాలనీల్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా అరుణ్ పటేల్ మాట్లాడుతూ, పదవి ఉన్నా లేకపోయినా సామాన్య పౌరుడిగా ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని తెలిపారు. తన స్వంత డబ్బుతో ఏర్పాటు చేసిన ఈ సౌకర్యాలు ప్రయాణికులకు ఉపయోగపడటం ఆనందంగా ఉందన్నారు.
భవిష్యత్తులో మరింత ఉత్సాహంతో ప్రజాసేవలో ముందుకు సాగేందుకు ఈ కార్యక్రమం తనకు స్ఫూర్తినిచ్చిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన కాలనీ అసోసియేషన్ సభ్యులు మరియు కాంగ్రెస్ కుటుంబ నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!
Posted On 2026-08-09 12:53:35
Readmore >
ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!
Posted On 2026-08-09 08:27:49
Readmore >
ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!
Posted On 2026-08-09 08:09:49
Readmore >
అంతర్జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >