Posted on 2025-12-25 15:00:55
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: అన్ని మతాల వారు సమానత్వంతో జీవించే గొప్ప సంప్రదాయం గల దేశం మనదని రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్,షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు.గురువారం క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని షాద్ నగర్ పట్టణంలో సిఎస్కెలో షాద్ నగర్ నియోజకవర్గ క్రిస్టియన్ మైనారిటీ కోఆర్డినేటర్ రవితేజ నివాసంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కేకు కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఏసుప్రభువు జీవితం ప్రపంచ దేశాలకే ఆదర్శమని అన్నారు. ప్రేమ, క్షమ, త్యాగాలే ఆయన బోధల సారమని వివరించారు. క్రిస్మస్ పండుగను అన్ని వర్గాల ప్రజలు ఐక్యతతో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గిరిజన ఆదివాసి రాష్ట్ర కోఆర్డినేటర్ రఘునాయక్, పట్టణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు చెంది తిరుపతిరెడ్డి ,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజ్ గౌడ్ ఫరూఖ్ నగర్ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, రాష్ట్ర నాయకుడు మహమ్మద్ ఇబ్రహీం,మొహమ్మద్ ఇసాక్,మహబూబ్, గంగమోని సత్తయ్య, శేఖర్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు..
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >
అర్థరాత్రి వేళ ఆపన్నహస్తం.. ""ఆపరేషన్ కవాచ్" తో సురక్షితంగా తల్లి ఒడికి బాలుడు!
Posted On 2026-04-08 17:33:40
Readmore >