| Daily భారత్
Logo




నగరంలో డిఏ ఫర్నిచర్ షోరూమ్ ను ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే

News

Posted on 2025-11-23 13:56:42

Share: Share


నగరంలో డిఏ ఫర్నిచర్ షోరూమ్ ను ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ లో ఆదివారం డిఏ ఫర్నిచర్ షోరూమ్ ని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ నగరం రోజురోజుకి తెలంగాణలోని అభివృద్ధి చెందుతున్న నగరాల్లో నెంబర్ వన్ గా నిలవడం సంతోషంగా ఉందన్నారు. ఒకప్పుడు ఏ చిన్న ఫర్నిచర్ అవసరం ఉన్న హైదరాబాద్, ఇతర మహా నగరాలకు వెళ్లి ఖరీదు చేసుకొని రావాల్సి ఉండేదని ఆయన అన్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులకు భిన్నంగా నిజామాబాద్ నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని నగరంలో డిఏ ఫర్నిచర్ షోరూమ్ ని స్థాపించిన యాజమాన్యం సాయ రెడ్డి, స్వప్న అనే  దంపతులు నిజామాబాద్ లాంటి నగరాల్లో అత్యాధునిక టెక్నాలజీ తో కూడిన ఫర్నిచర్ షోరూమ్ ని ఇక్కడ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అదేవిధంగా మాట్లాడుతూ నగరంలో ఆదివారం రోజు ఆరవ బ్రాంచ్ ను స్థాపించడం ఆనందంగా ఉందన్నారు. తక్కువ బడ్జెట్ తో నాణ్యమైన, మన్నికైన ఫర్నిచర్ అందించడం తమ ప్రత్యేకత అని అన్నారు. ఏ ఫర్నిచర్ షాపుల్లో లభించని విధంగా తమ షాపులో తక్కువ ధరకు అన్ని రకాల ఫర్నిచర్ లను కస్టమర్లకు అందించడం జరుగుతుందన్నారు. తమ షోరూమ్ కు వచ్చి జిల్లా ప్రజలు ఆదరించాలని ఆయన కోరారు.


కార్యక్రమంలో జడ్పిటిసి ఫోరం రాష్ట్ర కార్యదర్శి మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Image 1

తాడ్వాయి మండలంలోని కరడ్‌పల్లిలో కల్తీ కల్లు విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్

Posted On 2026-08-06 18:26:12

Readmore >
Image 1

పెద్ద చెరువును పరిశీలించిన జిల్లా ఎస్పీ

Posted On 2026-08-05 17:08:38

Readmore >
Image 1

పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ

Posted On 2026-08-05 17:07:25

Readmore >
Image 1

ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్

Posted On 2026-08-05 14:58:50

Readmore >
Image 1

దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?

Posted On 2026-08-05 13:28:01

Readmore >
Image 1

కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం

Posted On 2026-08-05 13:09:21

Readmore >
Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >