Posted on 2025-11-22 20:48:43
డైలీ భారత్ న్యూస్, పిఠాపురం:అక్రమ సంబంధం వలన భార్యను హత్య చేసిన భర్తను గ్రామీణ పోలీసులు అరెస్ట్ చేశారు.శనివారం గ్రామీణ పోలీస్ సర్కిల్ కార్యాలయంలో మీడియా సమావేశంలో డిఎస్పి మురళీకృష్ణ వెల్లడించిన వివరాల ప్రకార పిఠాపురం వాసి కిలిమి శివశంకర్ రెడ్డి, విజయవాడ పెనమలూరు గ్రామానికి చెందిన శివపార్వతి ప్రేమ వివాహం చేసుకొని కుటుంబ జీవనం కొనసాగిస్తున్నారు.పిఠాపురంలో కొంతకాలం, అనంతరం విజయవాడలో కాపురం ఉంటూ స్వీట్ షాప్లో స్వీట్లు తయారు చేసే పనిలో నిమగ్నమయ్యాడు. వ్యాపారంలో నష్టం రావడంతో తాత్కాలికంగా ప్రాంతం మార్చుకున్న ఈ దంపతుల మధ్య విభేదాలు తీవ్రం కాగా, శివపార్వతికి వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉన్నట్టు శంకర్ రెడ్డికి సమాచారం తెలుసుకున్నారు.ఈ నేపథ్యంలో ఎర్రబాలెం గ్రామానికి చేరుకున్న శంకర్ రెడ్డి, ఆమె గురించి విచారణ జరిపి అక్రమ సంబంధం నిజమని తెలుసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ కోపంతో గత నాలుగు రోజుల క్రితం తెరపాలం ప్రాంతంలో శివపార్వతిని గొంతునులిమి హత్య చేసి పరారయ్యాడు..ఈ విషయం పై మృతురాలి అన్న ఫిర్యాదు ఆధారంగా రూరల్ ఎస్సై వెంకట్ దర్యాప్తు ప్రారంభించి, గ్రామీణ సీఐ పర్యవేక్షణలో నిందితుడు శంకర్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లు డి.ఎస్.పి సిహెచ్ మురళీకృష్ణ వెల్లడించారు.
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >