Posted on 2023-12-24 14:14:24
సమావేశాని కి హాజరైన అదనపు కలెక్టర్ లు ఎన్ ఖీమ్యా నాయక్, పూజారి గౌతమి, అదనపు ఎస్పీ చంద్రయ్య
డైలీ భారత్, హైదరాబాద్ : జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి ఆదివారం హైదరాబాద్ లోని డా.బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో తొలిసారిగా సమావేశం అయ్యారు.ఈ సమావేశానికి రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి అదనపు కలెక్టర్ లు ఎన్ ఖీమ్యా నాయక్, పూజారి గౌతమి, అదనపు ఎస్పీ చంద్రయ్య లు హాజరయ్యారు.
సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాట్లాడుతూ...
ఈనెల 28వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ప్రజాపాలన నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డులలో సభలు నిర్వహిస్తామని.. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు.. తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సభలు నిర్వహిస్తామన్నారు.
వీటితో పాటు ప్రభుత్వం ప్రకటించిన 100 రోజుల్లో ఆరు గ్యారంటీల అమలు, పాలనా యంత్రాంగాన్ని గ్రామ స్థాయికి తీసుకొని పోయే "ప్రజా పాలన" కార్యక్రమాలపై అధికారులకు సిఎం దిశానిర్దేశం చేశారు కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక, పాలనా వ్యవస్థలో అత్యంత కీలకమైన కలెక్టర్ లు, ఎస్పీ లతో సీఎం సమావేశం కావడం ఇదే తొలిసారి.
170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
Posted On 2026-08-03 18:44:40
Readmore >
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >
60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు
Posted On 2026-08-03 05:55:39
Readmore >
ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు
Posted On 2026-08-03 05:54:41
Readmore >
అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం
Posted On 2026-08-03 05:49:18
Readmore >