Posted on 2025-07-03 16:37:18
బంజారుల మధ్య చిచ్చుపెట్టే కుట్ర మానుకుంటే మంచిది
లేకపోతే వచ్చే ఎన్నికల్లో ఆయా పార్టీల నేతలకు తగిన బుద్ధి చెప్తాం
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: అన్నదమ్ముల్లా కలిసి ఉన్న బంజారాలను విడిదీసేందుకు రాజ్యంగ బద్ధంగా ఎన్నుకున్న ఆలిండియా బంజారా సేవా సంఘం కమిటీలను కాదని సీల్డ్ కవర్ నియామకాలు చేస్తు చిచ్చుపెడుతున్న మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ తీరు మార్చుకోవాలని సంఘం అధ్యక్షులు చంద్రునాయక్ హెచ్చరించారు. గురువారం నిజామాబాద్ జిల్లా ఆలిండియా బంజారా సేవా సంఘం నూతన కార్యవర్గానికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలిండియా బంజారా సేవా సంఘం అధ్యక్షులు చంద్రునాయక్ మాట్లాడుతు.. బంజారాల (లంబాడా) ల హక్కుల కోసం పనిచేస్తు, రాజకీయంగా ఉన్నత పదవులు అనుభవించిన రాములు నాయక్ తన స్వార్ధ ప్రయోజనాల కోసం కొత్తగా కమిటీలను నియమాకం చేయరాదని అన్నారు. నిజామాబాద్ జిల్లా కమిటీని జిల్లాలోని అన్ని మండలాల కార్యవర్గాలతో కలిసి రాజ్యంగ బద్ధంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. ఆలిండియా బంజారా సేవా సంఘం జాతీయ కమిటీతో మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ కు అసలు సంబంధం లేదన్నారు. త్వరలో జాతీయ కమిటీని ఎన్నుకోవడం జరుగుతుందని అన్నారు. మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ కు మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం త్ రెడ్డిల దగ్గర మంచిపేరు ఉండగానే పోదని అన్నారు. తెలంగాణలో అత్యధికంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. ఆలిండియా బంజారా సేవా సంఘం జాతీయ కమిటీతో మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ కు అసలు సంబంధం లేదన్నారు. త్వరలో జాతీయ కమిటీని ఎన్నుకోవడం జరుగుతుందని అన్నారు. మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ కు మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిల దగ్గర మంచిపేరు ఉండగానే సరిపోదని అన్నారు. తెలంగాణలో అత్యధికంగా ఉన్న బంజారాల కమ్యూనిటీకి మంత్రి పదవి కావాలని ధర్నాకు పిలుపినిస్తే అందరం కలిసి పోరాడుదాం అన్నారు. తెలంగాణలో ప్రస్తుతం వ్యవసాయ కమీషన్ సభ్యులుగా రాములు నాయక్ ಬಂಜಾರಾಲ అభ్యున్నతికి పాటుపడితే హర్షిస్తామన్నారు. పోడు భూముల సాధనకు జరిగే ఉద్యమంలో కలిసి వస్తే స్వాగతిస్తామని అంతేగాని బంజారాల మధ్య బేదాభిప్రాయాలకు తావు ఇస్తే మాత్రం ఉరుకునేది లేదని చంద్రునాయక్ హెచ్చరించారు.
#nizamabad
గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్
Posted On 2026-06-06 08:15:43
Readmore >
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు
Posted On 2026-06-05 21:41:53
Readmore >
సుజాతనగర్లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్
Posted On 2026-06-05 21:27:15
Readmore >
500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు
Posted On 2026-06-05 20:42:30
Readmore >