Posted on 2025-06-29 12:23:12
డైలీ భారత్, విశాఖపట్నం: విశాఖ ఎక్స్ప్రెస్ రైలులో కొందరు దుండగులు భారీ దొంగతనానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో అప్రమత్తమైన రైల్వే పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు.
దొంగతనాలకు పాల్పడిన వారు బీహార్, మహారాష్ట్రకు చెందిన గ్యాంగ్లుగా గుర్తించారు.
వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువు వద్ద విశాఖ ఎక్స్ప్రెస్లో ఆదివారం తెల్లవారుజామున చోరీ యత్నం జరిగింది. ఈ క్రమంలో రైల్వే పోలీసులు.. గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో, దొంగల ముఠా పారిపోయింది. అయితే, పిడుగురాళ్ల సమీపంలో వరుసగా రైళ్లలో బీహార్, మహారాష్ట్ర గ్యాంగ్లు దొంగతనానికి పాల్పడుతున్నాయి. ఈ ముఠాలో ఏడుగురు సభ్యులున్నట్లు రైల్వే పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక, వారం రోజుల వ్యవధిల ఇప్పటికే రైళ్లలో రెండు సార్లు దొంగతనం జరిగింది. తాజాగా మూడోసారి ఆదివారం తెల్లవారుజామున దొంగతనానికి పాల్పడటంతో గాలిలోకి కాల్పులు జరిపినట్టు రైల్వే పోలీసులు చెప్పుకొచ్చారు.
14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ
Posted On 2026-06-06 16:51:52
Readmore >
వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు
Posted On 2026-06-06 16:51:06
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి
Posted On 2026-06-06 16:50:07
Readmore >
గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్
Posted On 2026-06-06 08:15:43
Readmore >
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు
Posted On 2026-06-05 21:41:53
Readmore >