| Daily భారత్
Logo




మంచానికి పరిమితమైన గుబ్బల సతీష్ కు.. జర్నలిస్టు కిరణ్ కుమార్ గండికోట ఆర్థిక సాయం

News

Posted on 2025-06-28 21:14:45

Share: Share


మంచానికి పరిమితమైన గుబ్బల సతీష్ కు.. జర్నలిస్టు  కిరణ్ కుమార్ గండికోట ఆర్థిక సాయం

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: ప్రమాదవశాత్తు గోడ కూలి నడుము మీద పడడంతో గుబ్బల సతీష్ వెన్నుపూస దెబ్బతిని  రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. 

కుటుంబ పోషణకు ఆటోడ్రైవర్ వృత్తిగా జీవనం సాగిస్తున్న సతీష్ గత 15 సంవత్సరాలుగా మంచానికే పరిమితమై అవస్థలు పడుతున్న దీన పరిస్థితి.

ఆర్థికంగా కుటుంబం నలిగిపోతుంది. వైద్యం, మెడిసిన్స్ కొరకు వేలాది రూపాయలు ఖర్చవుతుంది.

సతీష్ దీన పరిస్థితి కుటుంబ ఇబ్బందులను ఆర్థిక ఇబ్బందులను గమనించిన గండికోట కిరణ్ గుబ్బల సతీష్ ఇంటికి వెళ్లి పరామర్శించి, అతని ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకుని  నేనున్నానని ధైర్యం చెబుతూ.. సతీష్ కు ప్రతినెల  వెయ్యి రూపాయలు  మెడికల్ ఖర్చులకు అందజేస్తున్నారు.

ఈనేపథ్యంలో సతీష్ రెండు కాళ్లు తొలగించకుంటే ప్రాణాలకే ప్రమాదమని, హైదరాబాద్ లోని ఓ గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్లు చెప్పారు.

సాయం చేయటానికి మంచి మనసుతో పాటు ఆర్థిక సాయం కూడా చేసే తత్వం ఉన్న కిరణ్ వారికి అండగా నిలిచి మెడికల్ ఖర్చుల నిమిత్తం  ఐదువేల రూపాయలను ఆర్థిక సహాయం చేసి తన మానవత్వాన్ని చాటుకున్నారు.

 అంతేకాకుండా ఆపరేషన్ తరువాత గుబ్బల సతీష్ వారి కుటుంబ  బతుకుతెరువు కోసం  వ్యాపారం చేసుకుంటామని తెలిపారు.

 ఆపదలో ఉన్న వారికి చేయూతనివ్వు ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయి ఇంతకన్నా మానవత్వం దైవత్వం మరొకటి లేదు అనే కొటేషన్లు చదువుకొని వదిలిపెట్టే వారే ఉన్న నేటి సమాజంలో అందుకు భిన్నంగా కిరణ్ కుమార్ గండికోట ఆచరణలో చేసి చూపుతున్నారు.. 

గుబ్బల సతీష్ కుటుంబం వ్యాపారం చేసుకోవడానికి అవసరమయ్యే పెట్టుబడి పెడతానని హామీ ఇచ్చారు.. దీంతో పట్టణంలోని పలువురు జర్నలిస్ట్ కిరణ్ కుమార్ గండికోట రీల్ హీరోల కంటే రియల్ హీరో అంటూ అభినందనలు తెలుపుతున్నారు.

Image 1

మహిళల భద్రత – సమాజ ప్రగతికి బలమైన పునాది

Posted On 2026-06-06 18:47:24

Readmore >
Image 1

14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ

Posted On 2026-06-06 16:51:52

Readmore >
Image 1

వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు

Posted On 2026-06-06 16:51:06

Readmore >
Image 1

వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి

Posted On 2026-06-06 16:50:07

Readmore >
Image 1

వేధింపులను మౌనంగా భరించకండి.. ఎదురించండి.

Posted On 2026-06-06 10:44:23

Readmore >
Image 1

గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్

Posted On 2026-06-06 08:15:43

Readmore >
Image 1

పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-06-05 21:46:24

Readmore >
Image 1

విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు

Posted On 2026-06-05 21:41:53

Readmore >
Image 1

బూర్గంపహాడ్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

Posted On 2026-06-05 21:39:54

Readmore >
Image 1

కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు

Posted On 2026-06-05 21:28:52

Readmore >