Posted on 2025-06-09 10:00:53
డైలీ భారత్, మెదక్: వివాహేతర సంబంధం విషయం తెలిసి గ్రామస్తులు హెచ్చరించడంతో పురుగుల మందు తాగి ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఇందుకు తననే బాధ్యుడిని చేస్తారన్న భయంతో యువకుడు సైతం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మెదక్ జిల్లా హవేలిఘనపూర్ మండలంలో ఆదివారం వెలుగు చూసింది. ఎస్సై సత్యనారాయణ, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... హవేలి ఘనపూర్ మండలంలోని సుల్తాన్పూర్ తండాకు చెందిన సునీత (25)కు పెళ్లై ముగ్గురు పిల్లలు ఉన్నారు.
ఈమెకు కొన్నాళ్ల కింద అదే తండాకు చెందిన నరేశ్ (26) అనే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో కుల పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టి నరేశ్కు కు రూ.2.50 లక్షలు జరిమానా విధించడంతో పాటు ఇక మీదట ఇద్దరూ కలుసుకోవద్దని హెచ్చరించారు. అయినప్పటికీ సునీత, నరేశ్ వివాహేతర సంబంధం కొనసాగిస్తుండడంతో తండావాసులు మరోసారి పంచాయతీ నిర్వహించి హెచ్చరించారు. దీంతో మనస్తాపానికి గురైన సునీత (25) ఈ నెల 2న పురుగుల మందు తాగింది
అస్వస్థతకు గురైన సునీతను కుటుంబ సభ్యులు సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్కు తరలించగా అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ శనివారం రాత్రి చనిపోయింది. ఈ విషయం తెలుసుకున్న నరేశ్.. సునీత మృతికి తననే బాధ్యుడిని చేస్తారన్న భయంతో ఆదివారం సాయంత్రం మండల పరిధిలోని లింగ్సాన్పల్లి తండాకు వెళ్లి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు కేసు నమోదుచేసినట్లు హవేలి ఘనపూర్ ఎస్సై సత్యనారాయణ తెలిపారు.
జూలూరుపాడు తాసిల్దార్ కి వడ్లు మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం
Posted On 2026-04-13 17:32:13
Readmore >
కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా జాయింట్ కలెక్టర్ మెమోరాండం
Posted On 2026-04-13 17:30:28
Readmore >
పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి - రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు
Posted On 2026-04-13 17:28:31
Readmore >
ఇందిరమ్మ ఇల్లు నూతన గృహప్రవేశం కార్యక్రమానికి విచ్చేసిన టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-13 16:20:40
Readmore >