Posted on 2025-05-24 18:01:26
డైలీ భారత్, మహబూబాబాద్: ఈ నెల 25 ఆదివారం జరగబోయే గ్రామ పాలన అధికారుల రాత పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
శనివారం జిల్లా కలెక్టర్ మహబూబాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగే జి.పి.ఓ పరిక్ష ఏర్పాట్లను రెవెన్యూ అదనపు కలెక్టర్ కె.వీరబ్రహ్మ చారీ తో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ....
పరీక్షా కేంద్రంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఏర్పాటు చేయాలన్నారు. పరీక్ష కేంద్రం దగ్గర లోని నోటీస్ బోర్డులో సీటింగ్ అమరికను పరిశీలించారు. ఈ సీటింగ్ అమరిక, తరగతి గదిలోని సీటింగ్ ఒకేలా ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కంప్యూటర్ గదిని పరిశీలించారు. ఎలక్ట్రిసిటీ, త్రాగునీరు, తదితర మౌళిక వసతులు ఏర్పాటు చేయాలన్నారు. నిర్వహణ పై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఎక్కడ కాపీయింగ్ కు ఆస్కారం లేకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎలాంటి తప్పిదాలకు అవకాశం ఇవ్వకుండా చూడాలన్నారు. పక్కాగా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిపించాలన్నారు.
ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట డి.ఈ.ఓ డాక్టర్ ఏ.రవీందర్ రెడ్డి, స్థానిక ఎం.ఆర్.ఓ చంద్ర రాజేశ్వర్, పట్టణ సి.ఐ పి.దేవేందర్, సి.సెక్షన్ సూపరింటెండెంట్ వినోద్, ఈ.డి.యం ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్
Posted On 2026-06-17 13:12:03
Readmore >
గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-17 08:58:29
Readmore >
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >