Posted on 2023-08-29 13:35:53
హైదరాబాద్ : హైదరాబాద్లోని నానక్రామ్గూడలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో మహిళ దారుణ హత్యకు గురైనట్లు మంగళవారం పోలీసులకు తెలిసింది,మహిళపై అత్యాచారం చేసి అనంతరం బండరాయితో మోది దుండగులు కిరాతకంగా హత్య చేసినట్లు ఘటన స్థలంలో ఆనవాళ్లు ఉన్నట్లు సమాచారం.
ఈ ఘటనకు సంబంధించి స్థానికుల నుండి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మహిళ మృతదేహాన్ని గుర్తించారు. కాగా, మృతురాలిని గౌలిదొడ్డిలోని కేశవనగర్కు చెందిన మహిళగా పోలీసులు గుర్తించారు. నిర్మాణంలో ఉన్న ఈ భవనంలోకి మృతురాలు వేస్ట్ మెటీరియల్ తెచ్చుకునేందుకు వెళ్లినట్లు సమాచారం.
ఈ నెల 25 నుండి మహిళ కనబడటం లేదని పీఎస్లో మిస్సింగ్ కేస్ నమోదు అయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >
అర్థరాత్రి వేళ ఆపన్నహస్తం.. ""ఆపరేషన్ కవాచ్" తో సురక్షితంగా తల్లి ఒడికి బాలుడు!
Posted On 2026-04-08 17:33:40
Readmore >