Posted on 2024-09-09 07:49:54
గణేశ్ మండపంపై రాళ్లు.. సూరత్లో ఉద్రిక్తత
డైలీ భారత్, సూరత్: వినాయక మండపంపై రాళ్లు రువ్వడంతో ఒక్కసారిగా స్థానిక ప్రజలు రోడ్డు మీదకు వచ్చి నిరసన తెలిపారు.
దేశ వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రత్యేక మండపాలు ఏర్పాటుచేసి వినాయకుడికి పూజలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సూరత్లోని సయ్యద్పురా ప్రాంతంలో గణపతి మండపంపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వినాయక మండపంపై రాళ్లు రువ్వడాన్ని నిరసిస్తూ స్థానిక ప్రజలు ఆందోళనకు దిగారు. వెంటనే భారీ సంఖ్యలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సయ్యద్పురా ప్రాంతాన్ని తమ అదుపులోకి తీసుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే కాంతి బలార్ సంఘటనా స్థలానికి చేరుకుని.. నిందితులను వదిలిపెట్టబోమని, పోలీసులు చట్టప్రకారం చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. వినాయక మండపంపై రాళ్లు రువ్వడంతో ఒక్కసారిగా స్థానిక ప్రజలు రోడ్డు మీదకు వచ్చి నిరసన తెలిపారు. ఆందోళన తీవ్రతరం కావడంతో పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. కొన్నిచోట్ల బాష్పవాయువు ప్రయోగించి.. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న వారిని అరెస్టు చేశారు.
సూరత్లోని సయ్యద్పురా ప్రాంతంలోని గణేష్ మండపంపై రాళ్లు రువ్విన ఘటనలో ఆరుగురు వ్యక్తులను గుర్తించినట్లు గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘ్వీ తెలిపారు. ఈ ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. వీరితో పాటు మరో 27 మందిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతోందన్నారు. సూరత్లోని అన్ని ప్రాంతాల్లో పోలీసు బలగాలు మోహరించాయని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్పోస్ట్ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >
జిల్లా రవాణా ఆర్టిఏ కార్యాలయమును సందర్శించిన జిల్లా కలెక్టర్
Posted On 2026-08-01 15:44:11
Readmore >
భద్రాద్రి జిల్లా పాపకొల్లులో ఆషాడ బోనాల సంబరాలు... ఆదివారం కోట మైసమ్మకు ప్రత్యేక పూజలు
Posted On 2026-08-01 15:38:14
Readmore >
సిరిసిల్ల కోర్టు నిర్మాణ పనులు పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. తుకారాంజీ
Posted On 2026-08-01 14:12:57
Readmore >
వేములవాడలో ప్రైవేట్ ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లపై డీఎంహెచ్వో ఆకస్మిక తనిఖీలు
Posted On 2026-08-01 14:10:03
Readmore >
సకాలంలో రక్తాన్ని అందజేసి మానవత్వాన్ని చాటిన ఆర్ యస్ఐ సాయి ప్రసన్న
Posted On 2026-08-01 07:48:28
Readmore >
నాలుగు రోజుల పసికందును రూ. 5 లక్షలకు విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు
Posted On 2026-08-01 07:45:01
Readmore >