Posted on 2026-07-26 14:40:51
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎమ్మార్పీఎస్ నాయకుల సమావేశం జూలూరుపాడులో నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశానికి కి ముఖ్య అతిథిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇంచార్జ్ ములకలపల్లి రవి మాదిగ పాల్గొని మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా మండల మరియు గ్రామ కమిటీల నిర్మాణాన్నిత్వరితగతిన పూర్తి చేయాలని తీర్మానించారు. అలాగే సెప్టెంబర్ 9వ తేదీన జరగనున్న మండల కమిటీ జాతీయ సదస్సును విజయవంతం చేయడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. మాదిగల హక్కుల సాధనలో పాత్రను వివరిస్తూ, ప్రతి కార్యకర్త గ్రామ గ్రామానికి వెళ్లి ఉద్యమాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు
ఈ సమావేశంలో జిల్లా నాయకులు కొత్తపల్లి సోమయ్య,రేపంగి రమణయ్య,నలగట్ల వెంకన్న, విసనపల్లి కృష్ణ, చెంగల గురునాథం, కొమ్ము హుస్సేన్, చాపలమడుగు వెంకటేశ్వర్లు,ఈశ్వరయ్య ,వల్లపోగు వెంకటేశ్వర్లు, రామ్మూర్తి, కాకటీ బాబు, రవి కుమార్, కత్తి బాలకృష్ణ, జగన్నాథం, నరసింహారావు, రామ్మూర్తి, కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు
170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
Posted On 2026-08-03 18:44:40
Readmore >
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >
60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు
Posted On 2026-08-03 05:55:39
Readmore >
ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు
Posted On 2026-08-03 05:54:41
Readmore >
అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం
Posted On 2026-08-03 05:49:18
Readmore >