Posted on 2026-07-14 13:21:15
ప్రభుత్వ కార్యాలయంలో కొత్త సంస్కృతి. "మనమందరం సమానమే" అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన తహసిల్దార్ శ్రీనివాస్
డైలీ భారత్, పెద్దాపురం, కాకినాడ జిల్లా: ప్రభుత్వ కార్యాలయాల్లో సాధారణంగా కనిపించే దృశ్యాలకు భిన్నంగా పెద్దాపురం తహసిల్ కార్యాలయంలో ఇప్పుడు కొత్త వాతావరణం కనిపిస్తోంది.
తహసిల్దార్ శ్రీనివాస్ తీసుకున్న ఒక చిన్న నిర్ణయం ప్రజల్లో పెద్ద చర్చకు దారితీసింది. కార్యాలయానికి వచ్చే వారు చేతులు కట్టుకోవడం, కాళ్లు పట్టుకోవడం, ఏడవడం వంటివి చేయవద్దని కార్యాలయం బయట ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.
"మనం అందరం సమానమే" అనే సందేశంతో ఉన్న ఈ ఫ్లెక్సీ ఇప్పుడు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది.
ఇప్పటివరకు ఏ ప్రభుత్వ కార్యాలయంలోనూ ఇలాంటి ప్రకటన చూడలేదని స్థానికులు చెబుతున్నారు. పనుల కోసం వచ్చే సామాన్యుల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు తీసుకున్న ఈ నిర్ణయం స్వాగతించదగినదని అంటున్నారు.
అంతేకాకుండా తహసిల్దార్ శ్రీనివాస్ అర్జీదారుల సమస్యలను ఓపికగా విని, వెంటనే సిబ్బందితో మాట్లాడి పరిష్కారం చూపిస్తున్నారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
"అధికారి అంటే భయం కాదు, సేవకుడు" అనే భావనను ఈ ఒక్క ఫ్లెక్సీతో ఆయన ముందుకు తెచ్చారు. ఈ తరహా చర్యలు ఇతర కార్యాలయాలకు కూడా ఆదర్శంగా నిలుస్తాయని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
#Peddapuram #Tahsildar #Kakinada #PublicService #AndhraPradesh
170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
Posted On 2026-08-03 18:44:40
Readmore >
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >
60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు
Posted On 2026-08-03 05:55:39
Readmore >
ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు
Posted On 2026-08-03 05:54:41
Readmore >
అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం
Posted On 2026-08-03 05:49:18
Readmore >