Posted on 2026-04-05 15:45:37
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డా. బాబూ జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలను జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ సెంటర్లోని భద్రాద్రి కొత్తగూడెం క్లబ్లో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అంకిత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ అంకిత్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి, డా. బాబూ జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు అర్పించి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, డా. బాబూ జగ్జీవన్ రామ్ దేశ రాజకీయాల్లో సుదీర్ఘకాలం విశిష్ట సేవలు అందించి, సామాజిక న్యాయ సాధనకు కృషి చేసిన మహానేత అని కొనియాడారు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఉన్నత స్థాయికి ఎదగాలంటే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని సూచించారు.
కేంద్ర ప్రభుత్వంలో అనేక శాఖలకు మంత్రిగా సేవలందించడమే కాకుండా, దేశ ఉప ప్రధానిగా కూడా సమర్థవంతంగా పనిచేసి ప్రజాసేవకు అంకితభావంతో నిలిచారని తెలిపారు.
మహనీయుల ఆశయాలను ఆచరణలో పెట్టి సమాజంలో వివక్ష లేకుండా సమానత్వంతో ముందుకు సాగాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రోహిత్ రాజు, అదనపు కలెక్టర్ వేణు గోపాల్, కొత్తగూడెం మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, సీపీఐ నాయకులు ఎస్.కె. సాబీర్ పాషా, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి ఎం. శ్రీలత, జయంతి ఉత్సవ కమిటీ కన్వీనర్ దాసరి శ్రీనివాస్, కో-కన్వీనర్లు చదలవాడ సూరి, కూసపాటి శ్రీనివాస్, మంద హనుమంతు, మద్దెల శివకుమార్, దాసరి సారథి. మధుబాబు. దాసరి చక్రి దాసరి సంధ్య.. రవి. మొగిలి. తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్
Posted On 2026-04-09 15:19:40
Readmore >
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >