Posted on 2025-10-19 07:50:57
పది రోజులుగా ఆర్థోపెడిక్ రోగులకు అందని సేవలు
ఇబ్బందుల్లో రోగుల బంధువులు .. సేవలు కోసం రోజులకొద్దీ నిరీక్షణ
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:రోజుకు వేలాదిమంది ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి లో సరైన పరికరాలు పనిచేయక రోగుల కు ఇబ్బందులు తప్పడం లేదు. కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి అధికారి వరకు ఈ సమస్యను దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ, ఇది మా చేతిలో పని కాదు, అది అంతా ప్రభుత్వం చూసుకోవాల్సింది అంటూ చెబుతున్నారు తప్ప కాళ్లు, చేతులు విరిగిన వారికి వారముల కొద్దీ ఆపరేషన్లు చేయకుండా మంచానికే పరిమితం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రం చెందిన పి. సాయిలు అనే వృద్ధుడు ప్రమాదవశాత్తు కిందపడి కాలు, చెయ్యి విరిగిపోయింది. సాయిలు ఈనెల 6న నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం తరలించారు. సాయిలు కు మొదటగా రక్తం తక్కువ ఉందని రక్తం ఎక్కించాలని రోగి బంధువులకు చెప్పడంతో, వారు బయట మార్కెట్ నుంచి 1500 రూపాయలు పెట్టి రక్తం తీసుకువచ్చారు. ఆ తర్వాత సియాన్ మిషిన్ చెడిపోయింది, దీనివల్ల ఆపరేషన్ చేయడం కుదరదు అంటూ ఆ రోగిని బెడికే పరిమితం చేశారు. ఆరవ తేదీ నాడు ఆసుపత్రిలో చేరితే 12 రోజులుగా ఆ రోగికి ఆపరేషన్ చేయకుండా బెడ్కే పరిమితం చేశారు. రోగిని ఆస్పత్రిలో చేర్పించిన రోజు ఆ రోగికి రక్తం లేదు అని వైద్యులు చెప్పారు. వైద్యులు చెప్పిన విధంగా వారు ప్రైవేట్ నుంచి రక్తం తీసుకొచ్చి వైద్యులకు ఇచ్చారు. రోగిని ఆస్పత్రిలో చేర్పించిన రోజు ఆ రోగికి రక్తం లేదు అని వైద్యులు చెప్పారు. వైద్యులు చెప్పిన విధంగా వారు ప్రైవేట్ నుంచి రక్తం తీసుకొచ్చి వైద్యులకు ఇచ్చారు. మళ్లీ ఇప్పుడు ఆపరేషన్ చేసే మిషన్ పాడైంది టెక్నీషియన్ వచ్చేవరకు ఆపరేషన్ కాదు అంటూ కరాకండిగా వైద్యులు వెల్లడిస్తున్నారు. అత్యవసరమైన ఈ కేసులను తొందరగా ఆపరేషన్ చేసి వారికి సేవలు అందించే సియన్ మిషిన్ చెడిపోతే ఈ యంత్రాన్ని 24 గంటల్లో బాగు చేయించవలసి ఉండగా వారి నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. కింది సిబ్బంది అధికారి మొదలుకొని ఉన్నత స్థాయి అధికారులకు తాము ఏమి చేయలేము, ఇదంతా ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ప్రభుత్వం ఎప్పుడు టెక్నీషియన్ పంపిస్తే అప్పుడు మిషన్ బాగుపడుతుంది. అప్పుడు ఆపరేషన్లు చేస్తాం అని వైద్యుడు చెప్పుకోవస్తున్నారు. ఇలా రోజులకొద్దీ మిషన్ బాగు చేయలేక కాళ్లు, చేతులు విరిగిన రోగులు మంచం పట్టుకుని వైద్యం కోసం నిరీక్షిస్తున్నారు. ఆస్పత్రి వైద్యులు మాత్రం టెక్నీషియన్ వచ్చేవరకు తాము ఏమి చెప్పలేమని తెలుపుతున్నారు. ప్రతిరోజు వేలాదిమంది కి వైద్యం అందించే నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి లో ఇంత నిర్లక్ష్యం ఉండడం రోగులకు శాపంగా మారింది. జిల్లాకే పెద్ద ఆసుపత్రి అయినా ఈ ఆసుపత్రిలో మిషన్ చెడిపోతే 24 గంటల్లో బాగు చేయించాల్సిన రాష్ట్ర ఉన్నత అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థం కావడం లేదు. జిల్లాకే పెద్ద ఆసుపత్రి అయినా ఈ ఆసుపత్రిలో మిషన్ చెడిపోతే 24 గంటల్లో బాగు చేయించాల్సిన రాష్ట్ర ఉన్నత అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థం కావడం లేదు. దీనివల్ల రోగులు రోజులకొద్దీ ఆసుపత్రిలో చికిత్స కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి మన పాలకులు, అధికారులు తెచ్చి పెడుతున్నారు. ఇప్పటికైనా పేదలకు వైద్యం అందించే ప్రభుత్వ ఆసుపత్రి పై పాలకులు, ప్రభుత్వం దృష్టి పెట్టి ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను పరిస్థితి పరిష్కారం చేయాలని రోగుల బంధువులు కోరుతున్నారు.
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >
అర్థరాత్రి వేళ ఆపన్నహస్తం.. ""ఆపరేషన్ కవాచ్" తో సురక్షితంగా తల్లి ఒడికి బాలుడు!
Posted On 2026-04-08 17:33:40
Readmore >
గర్భిణీ స్త్రీలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సరైన వైద్య సేవలు పొందాలి : జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి.
Posted On 2026-04-08 17:28:46
Readmore >
వరద ముంపునకు గురైన గిరిజన గురుకుల పాఠశాల నాగిరెడ్డిపేట్ కు గ్రీన్కో ఫౌండేషన్ ఆపన్నహస్తం
Posted On 2026-04-08 13:14:54
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : ప్రేమ-పెళ్లి పేరుతో యువతిని వేధిస్తున్న యువకుడు అరెస్ట్,రిమాండ్కు తరలింపు
Posted On 2026-04-08 12:27:46
Readmore >