Posted on 2025-07-18 13:38:16
టీటీడీ ధర్మకర్త నన్నూరి నర్సిరెడ్డిని,బక్కని నరసింహులని సన్మానించిన మోతె రాజిరెడ్డి
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఈరోజు తెలుగుదేశం పార్టీ కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయంలో పార్లమెంట్ అధ్యక్షులు వంచ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కరీంనగర్ పార్లమెంట్ ముఖ్య నాయకుల సమావేశానకి అతిధిలుగా విచ్చేసిన తెలుగుదేశం పార్టీ తెలంగాణా రాష్ట్ర మాజీ అధ్యక్షులు, జాతీయ అధికార ప్రతినిధి టిటిడి బోర్డు మెంబర్ నన్నూరి నర్సిరెడ్డి. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ,మండల కమిటీలను ఏర్పాటు,పార్టీకి పూర్వ వైభవం తీసుకునిరావడానికి అలాగే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడం వంటి వాటిపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు దృష్టి సారించారని ఆనాడు బడుగు బలహీన వర్గాలకు రాజకీయంగా ఎదుగుదలకి తోడ్పాటు ఇచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు.పార్టీ కమిటీలో మరియు రానున్న ఎన్నికల్లో యువతకి ప్రాధాన్యం ఇవ్వాలని జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన సూచన ప్రకారం అవకాశం కల్పిస్తూ పార్టీ బలోపేతానికి నాంది పలకాలని వారు సూచించారు.
ఈ కార్యక్రమంలో సిరిసిల్ల నియోజకవర్గ మాజీ ఇంచార్జి ఆవునూరి దయాకర్ రావు,వేములవాడ అడాక్ కమిటీ సభ్యులు మోతె రాజిరెడ్డి,చింతల కోటి రామస్వామి గౌడ్,మాలోత్ సూర్యనాయక్,చెట్కూరి నారాయణ గౌడ్,బింగి వెంకటేశం,జెట్టి కొమురయ్యా,వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
Posted On 2026-08-03 18:44:40
Readmore >
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >
60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు
Posted On 2026-08-03 05:55:39
Readmore >
ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు
Posted On 2026-08-03 05:54:41
Readmore >
అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం
Posted On 2026-08-03 05:49:18
Readmore >