Posted on 2025-07-03 16:20:47
ప్రభుత్వం ఇచ్చిన పేదల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు తాళం వేసిన అధికారులు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: బాన్సువాడ మండలంలోని దేశాయిపేట గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు గురువారం రెవెన్యూ అధికారులు తాళాలు వేశారు. గత ప్రభుత్వం పేదల కోసం నిర్మించిన ఇళ్లలో ఉంటున్న ఆరుగురు లబ్దిదారుల ఇళ్లకు తాళాలు వేసి నోటీసులు అతికించారు. దీంతో లబ్దిదారులు ఆందోళనకు దిగారు.తామంతా ఇళ్లలో ఉంటున్నామని అధికారులకు వివరించిన, వినిపించుకోకుండా తాళాలు వేసి జప్తు చేసుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అధికారులు ఇళ్లకు తాళాలు వేయడంతో లబ్దిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇళ్లను ఇచ్చి మళ్లీ లాక్కోవడం ఇంతవరకు సమంజసమని కన్నీరు పెట్టుకున్నారు.బీజేపీ నాయకుల పరామర్శవిషయం తెలుసుకున్న బీజేపీనాయకులులక్ష్మీనారాయణ, గంగారెడ్డి, శ్రీనివాస్, ప్రసాద్ ఘటన స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. పేదలకు కేటాయించిన ఇళ్లను అధికారులు మళ్లీ లాక్కోవడం హేయమైనచర్యగా అభివర్ణించారు. తక్షణమే అధికారులు లబ్దిదారుల ఇళ్లను అప్పగించాలని కోరారు.
170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
Posted On 2026-08-03 18:44:40
Readmore >
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >
60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు
Posted On 2026-08-03 05:55:39
Readmore >
ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు
Posted On 2026-08-03 05:54:41
Readmore >
అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం
Posted On 2026-08-03 05:49:18
Readmore >