Posted on 2025-06-16 13:07:35
డైలీ భారత్, ములుగు: లంచం తీసుకుంటూ డీఈవో ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ సంఘటన ములుగు జిల్లాలో చోటు చేసుకుంది. డీఈఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి ప్రభుత్వ ఉపాధ్యాయుని వద్ద లంచం తీసుకుంటుండగా జిల్లా విద్యాశాఖ అధికారి జి. పాణి నితో పాటు కార్యాలయ ఉద్యోగి దిలీప్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..కన్నాయిగూడెం మండలానికి చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు గత సంవత్సరం అనారోగ్యం కారణంగా సెలవు తీసుకున్నాడు.
సెలవు తీసుకున్న అనంతరం విధుల్లో చేరిన ఉపాధ్యాయుడు సెలవు దినాలలో వేతనం బిల్లును మంజూరు చేయాలని డీఈఓను కోరడంతో రూ.25వేల లంచం డిమాండ్ చేశారు. దీంతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. సోమవారం ములుగు జిల్లా కేంద్రంలోని డీఈఓ కార్యాలయంలో డీఈఓతో పాటు కార్యాలయ ఉద్యోగికి రూ.20 వేలను ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని కేసు నమోదు చేశారు.
170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
Posted On 2026-08-03 18:44:40
Readmore >
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >
60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు
Posted On 2026-08-03 05:55:39
Readmore >
ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు
Posted On 2026-08-03 05:54:41
Readmore >
అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం
Posted On 2026-08-03 05:49:18
Readmore >