| Daily భారత్
Logo




ఆందోళనకరంగా వైరస్‌ల విజృంభణ... హైదరాబాద్ లో నార్వక్ వైరస్ కల్లోలం

News

Posted on 2024-07-23 09:44:38

Share: Share


ఆందోళనకరంగా వైరస్‌ల విజృంభణ... హైదరాబాద్ లో నార్వక్ వైరస్ కల్లోలం

భారతదేశ రాష్ట్రాలలో ఆందోళనకరంగా వైరస్‌ల విజృంభణ

తాజాగా చాందీపురా,నిఫా,జికా... కల్లోలం..

హైదరాబాద్ లో నార్వక్ వైరస్ కల్లోలం

అప్రమత్తంగా ఉండాలని సూచించిన డాక్టర్ల బృందం

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: నిఫా, జికా, చాందీపురా ప్రాణాంతక వైరస్‌లు భారత్‌ను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

 అటు ఉత్తర భారతదేశంలో గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలు చాందీపురా వైరస్‌తో సతమతమవుతుంటే, మహరాష్ట్రలో జికా వైరస్ విజృంభిస్తోంది. 

వీటికి తోడు కేరళలో నిఫా వైరస్‌ జోరు పెంచింది. మొత్తానికి 3 ప్రాణాంతక వైరస్‌లు 4 రాష్ట్రాలను వణికిస్తున్నాయి.

తాగాగా గుజరాత్‌లో 50మంది చాందీపురా వైరస్‌ బారిన పడితే..వారిలో 16 మంది మృతి చెందడం కలకలం సృష్టిస్తోంది. 

గుజరాత్‌లో రోజు రోజుకూ చాందీపురా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. 

దాని పొరుగున ఉన్న మహారాష్ట్ర 2021 నుంచి అత్యధిక సంఖ్యలో జికా వైరస్ కేసులతో పోరాడుతోంది. 

మరోవైపు కేరళ రాష్ట్రంలో మలప్పురానికి చెందిన 14 ఏళ్ల బాలుడు నిఫా వైరస్‌ సోకి మరణించడంతో కేరళ ప్రభుత్వం వైరస్‌ నివారణ చర్యలను వేగవంతం చేస్తోంది. 

ఇది అంటువ్యాధి కావడంతో వైరస్‌ విస్తరించకుండా కేరళ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది.

చాందీ పూర వైరస్ సోకిన సాండ్‌ఫ్లైస్ లేదా డ్రైన్‌ఫ్లైస్ నుంచి కాటు ద్వారా ఈ వైరస్‌ వ్యాపిస్తుంది. 

తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా చాందీపురా 50 కేసులు నమోదైతే వారిలో 16 మంది మరణించారు. వైరస్‌ని ఎదుర్కోవడానికి అక్కడి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ప్రభావిత జిల్లాల్లో మలాథియాన్ పౌడర్‌ను పిచికారీ చేస్తున్నారు.జ్వరసంబంధమైన కేసులకు ఇంటెన్సివ్ చికిత్స అందిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మరింత వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు నర్సులతో పాటు ఆశా, అంగన్‌వాడీ వర్కర్లు వంటి అట్టడుగు స్థాయి కార్యకర్తలతో ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం, చందీపురా వైరస్‌కు నిర్దిష్ట యాంటీవైరల్ చికిత్స లేదు, కాబట్టి రోగలక్షణ నిర్వహణపై దృష్టి సారించడంతో పాటు సంక్లిష్టతలను నివారించడంలో సహాయక సంరక్షణ అవసరం.

హైదరాబాద్‌‌లో నార్వాక్‌ వైరస్‌ విజృంభిస్తోంది. గత కొన్నిరోజులుగా హైదరాబాద్‌లోని నిలోఫర్‌ ఆస్పత్రికి నార్వాక్‌ బాధితులు క్యూ కడుతున్నారు. లక్షణాలు తీవ్రంగా ఉంటే… ఆస్పత్రిలో చేర్పించి వైద్యులు. చికిత్స అందిస్తున్నారు. మరీ ముఖ్యంగా చిన్నారుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత లేకపోవడం, కలుషిత ఆహారం, కలుషిత నీళ్లు తీసుకోవడం వల్ల ఈ వైరస్‌ ప్రబలుతుందని వైద్యులు అంటున్నారు . తీవ్రమైన డీహైడ్రేషన్, నిస్సత్తువ, ఏం తినలేని పరిస్థితి ఉంటే మాత్రమే ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించాలని చెబుతున్నారు.

Image 1

పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-06-05 21:46:24

Readmore >
Image 1

విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు

Posted On 2026-06-05 21:41:53

Readmore >
Image 1

బూర్గంపహాడ్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

Posted On 2026-06-05 21:39:54

Readmore >
Image 1

కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు

Posted On 2026-06-05 21:28:52

Readmore >
Image 1

సుజాతనగర్‌లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్

Posted On 2026-06-05 21:27:15

Readmore >
Image 1

500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు

Posted On 2026-06-05 20:42:30

Readmore >
Image 1

కాకినాడ రూరల్: సీనియర్ అసిస్టెంట్ ఇంటిపై ఏసీబీ దాడులు

Posted On 2026-06-05 20:39:30

Readmore >
Image 1

పుప్పాల‌గూడ‌లో హైడ్రా భారీ ఆప‌రేష‌న్‌

Posted On 2026-06-05 20:23:17

Readmore >
Image 1

దమ్మపేట ఎస్సై రాజేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆటో డ్రైవర్స్ యూనియన్

Posted On 2026-06-05 20:16:20

Readmore >
Image 1

ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో కాంస్య పతకం సాధించిన మహిళా కానిస్టేబుల్‌ సౌభాగ్యా కు ఎస్పీ అభినందనలు

Posted On 2026-06-05 20:14:05

Readmore >