Posted on 2024-02-27 14:30:22
భూ కబ్జాలకు సంబంధించిన సమస్యలపై ప్రజలు ధైర్యంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో పిర్యాదు చేయవచ్చు - జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భూ సమస్యల్లో జోక్యం చేసుకొని భూ కబ్జాలకు పాల్పడుతూ, నకిలీ భూ పత్రాలు సృష్టించి ప్రజలను మోసం చేస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్న తంగళ్ళపల్లి మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులపై తంగళ్ళపల్లి పోలీస్ లు కేసు నమోదు చేయడం జరిగిందని, భూ కబ్జాలకు సంబంధించిన సమస్యలపై ప్రజలు దైర్యంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో పిర్యాదు చేయవచ్చు అని జిల్లా ఎస్పీ తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..
తంగళ్ళపల్లి మండలంలోని లక్ష్మీపూర్ శివారులో గత 45 సంవత్సరాల క్రితం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన గుర్రం అంజయ్య కొనుగోలు చేసిన భూమిలో వ్యవసాయం చేసుకుంటుండగా తంగళ్ళపల్లి గ్రామానికి చెందిన కోడి అంతయ్య అనే వ్యక్తి అట్టిని భూమిని అక్రమించాలనే ఉద్దేశంతో గుర్రం అంజయ్యను మరియు కుటుంబ సభ్యులను బెదిరించి కొంత భూమిని కబ్జా చేసినందుకు అతనిపైన కేసు నమోదు చేయడం జరిగిందని మరియు తంగళ్ళపల్లి శివారులోని శోభ అనే మహిళ యొక్క భూమిని కబ్జా చేయాలనే ఉద్దేశంతో వారి భూమిలోకి అక్రమంగా ప్రవేశించిన కోడి అంతయ్య పైన కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. భూమి పత్రాలు లేకున్నా నకిలీ భూ పత్రాలు సృష్టించి మోసం చేసి డబ్బులు తీసుకున్న వట్టిమల్ల శ్రీనివాస్ పై కేసు నమోదు.
భూమి లేకున్నా ఉన్నట్టు నమ్మించి నమ్మకం చేసిన వ్యక్తి పైన కేసు నమోదు తంగళ్ళపల్లి మండలంలోని అంకుషాపూర్ దారిలో గల సర్వేనెంబర్ 160 లో ఉన్నటువంటి రెండు గంటల భూమి తన పేరును లేకపోయినా ఉన్నదని నమ్మించి చిలుక.శ్రీనివాస్ అనే వ్యక్తి తో ఒప్పందం చేసుకొని అతని వద్ద నుండి 8 లక్షల 40 వేల రూపాయలు తీసుకున్న వట్టి మల్ల శ్రీనివాస్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.
జిల్లాలో భూ కబ్జాలు చేస్తూ, నకిలీ భూ పత్రాలు సృష్టించి బెదిరింపులకు పాల్పడే వారి సమాచారం వారి నేర ప్రవృత్తి ప్రజలు ధైర్యంగా పోలీసుల దృష్టికి తీసుకురావాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ సూచించారు.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >
జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్
Posted On 2026-08-01 16:47:06
Readmore >
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్పోస్ట్ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >