Posted on 2024-02-27 13:15:48
డైలీ భారత్, సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణ అభివృద్ధికి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు కోట్ల రూపాయలు మంజూరు చేయడం పట్ల సిరిసిల్ల కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్ కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా ఇంచార్జీ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సహకారం, కేకే మహేందర్రెడ్డి చొరవతో రెండు కోట్ల రూపాయలు మంజూరు కావడంపై సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. రెండు కోట్ల రూపాయలను గర్ల్స్ స్కూల్ లలో మూత్రశాలలు బోర్లకు, ప్రతి వార్డులో డ్రైనేజీలు, రోడ్డు నిర్మాణ పనులకు వినియోగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ అధ్యక్షులు ఆకునూరి బాలరాజు, జిల్లా నాయకులు వైద్య శివప్రసాద్, పట్టణ ప్రధాన కార్యదర్శి మ్యాన ప్రసాద్, కాంగ్రెస్ నాయకులు స్వర్గం రాజు, నక్క నరసయ్య, రఫీ, అస్లాం, నల్ల శ్రావణ్, గడ్డం కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >
జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్
Posted On 2026-08-01 16:47:06
Readmore >
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్పోస్ట్ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >