| Daily భారత్
Logo




పూరీ జగన్నాథ రథయాత్ర

Devotional

Posted on 2026-07-16 05:34:18

Share: Share


పూరీ జగన్నాథ రథయాత్ర

డైలీ భారత్ వెబ్ డెస్క్: నేడు జగన్నాథుడి రథయాత్ర. ఈ జగత్తనే మాయా నాటకంగా నడిపిస్తున్న పరమాత్మ, శ్రీకృష్ణావతారం ముగిసిన అనంతరం పూరీ క్షేత్రంలో దారుబ్రహ్మ రూపంలో కొలువుదీరాడని భక్తుల విశ్వాసం. ఒడిశా భూమిలో ఏ శుభకార్యం జరిగినా ముందుగా తలచుకునేది, పూజించేది జగన్నాథుడినే. వారికి ఆయనే సర్వస్వం. తెలుగువారికి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి, తమిళులకు శ్రీరంగనాథుడు, గుజరాతీలకు ద్వారకాధీశుడు ఎంత ప్రీతిపాత్రులో, ఒడిశా ప్రజలకు జగన్నాథస్వామి అంతే ఆరాధ్యదైవం. ఒడిశాలో జగన్నాథస్వామి ఆలయం లేని ఊరు ఉండదంటే అతిశయోక్తి కాదు.

1967లో తొలిసారిగా భారతదేశం వెలుపల పూరీ జగన్నాథ రథయాత్ర అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలో నిర్వహించారు. ఇస్కాన్ సంస్థ విదేశీ గడ్డపై మొదటి రథయాత్రను అక్కడే నిర్వహించింది. అనంతరం 1969లో లండన్‌లో తొలి రథయాత్ర జరిగింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 108కు పైగా నగరాల్లో జగన్నాథ రథయాత్రలు ఘనంగా జరుగుతున్నాయి. భారతదేశంలో కూడా గుజరాత్‌లోని అహ్మదాబాద్, పశ్చిమ బెంగాల్‌లోని మహేశ్ తదితర ప్రాంతాల్లో వందల ఏళ్లుగా రథయాత్రలు నిర్వహిస్తున్నారు.

అయితే పూరీ రథయాత్ర కేవలం ఒక్కరోజు జరిగే ఉత్సవం కాదు. ఇది సుమారు పన్నెండు రోజులపాటు కొనసాగే మహోత్సవం. ఆషాఢ శుద్ధ విదియనాడు జగన్నాథస్వామి, బలభద్రుడు, సుభద్రాదేవిని ప్రత్యేక రథాలపై కొలువుదీర్చి, లక్షలాది మంది భక్తుల జయజయధ్వానాల మధ్య పూరీ వీధుల్లో ఊరేగిస్తారు.

జగన్నాథస్వామి రథం పేరు నందిఘోష. ఇది 44 అడుగుల ఎత్తు, 16 చక్రాలతో ఉండి ఎరుపు–పసుపు రంగుల వస్త్రాలతో అలంకరించబడుతుంది. బలభద్రుడి రథం తాళధ్వజం. ఇది 43 అడుగుల ఎత్తు, 14 చక్రాలతో ఉండి ఎరుపు–ఆకుపచ్చ రంగుల వస్త్రాలతో అలంకరిస్తారు. సుభద్రాదేవి రథం దర్పదళన. ఇది 42 అడుగుల ఎత్తు, 12 చక్రాలతో ఉండి ఎరుపు–నలుపు రంగుల వస్త్రాలతో అలంకరించబడుతుంది.

ప్రతి సంవత్సరం రథయాత్ర కోసం కొత్త రథాలను నిర్మించడం విశిష్ట సంప్రదాయం. ముందుగా బలభద్రుడి రథం, ఆ తర్వాత సుభద్రాదేవి రథం, చివరగా జగన్నాథస్వామి రథం ప్రయాణం ప్రారంభిస్తాయి. యాత్ర ప్రారంభానికి ముందు పూరీ గజపతి మహారాజు బంగారు చీపురుతో రథాల ముందు ఊడ్చే "ఛేరా పహరా" సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది.

మధ్యాహ్నం ప్రారంభమైన రథయాత్ర సాయంత్రానికి గుండీచా ఆలయానికి చేరుకుంటుంది. అక్కడ స్వామివారు ఏడు రోజులపాటు కొలువుదీరుతారు. ఎనిమిదో రోజున తిరుగు రథయాత్ర ప్రారంభమై ప్రధాన ఆలయానికి చేరుకుంటుంది. తిరుగు రథయాత్ర అనంతరం జరిగే సునా బేష సందర్భంగా జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవిని అపారమైన బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. ఈ సందర్భంగా మాత్రమే స్వామివారు కరచరణాలతో భక్తులకు దర్శనమిస్తారు.

ఆ తరువాతి రోజున విగ్రహాల ఎదుట భారీ మట్టిపాత్రలో పంచామృతాన్ని నివేదిస్తారు. ఆలయంలోకి ప్రవేశించలేని పితృదేవతలు ఈ పంచామృతాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారనే విశ్వాసం ఉంది. అందువల్ల ఈ పంచామృతాన్ని సామాన్య భక్తులకు ప్రసాదంగా ఇవ్వరు.

Image 1

బిజెపి నాయకత్వంపై నమ్మకంతో పనిచేస్తా... రమేష్ యాదవ్

Posted On 2026-08-02 15:18:04

Readmore >
Image 1

ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న నగర సీపీ సజ్జనర్

Posted On 2026-08-02 09:35:33

Readmore >
Image 1

స్వర్ణ కాంతుల్లో భారత వనితలు... రింగులో రికార్డుల పంట!

Posted On 2026-08-02 07:32:52

Readmore >
Image 1

సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్...

Posted On 2026-08-01 19:13:32

Readmore >
Image 1

నామినేటెడ్ పోస్టులపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన

Posted On 2026-08-01 19:11:17

Readmore >
Image 1

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

Posted On 2026-08-01 18:43:13

Readmore >
Image 1

G.O 25 రద్దు చేయాలి, CPS రద్దు చేసి OPS అమలు చేయాలి: TPTF

Posted On 2026-08-01 16:59:26

Readmore >
Image 1

జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్

Posted On 2026-08-01 16:47:06

Readmore >
Image 1

సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన

Posted On 2026-08-01 15:52:51

Readmore >
Image 1

కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-08-01 15:46:07

Readmore >