Posted on 2025-12-16 02:38:52
డైలీ భారత్ న్యూస్, హుజూర్ నగర్:రేపు జరిగే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో బూరగడ్డ, లింగగిరి, శ్రీనివాసపురం గ్రామాలలో పోలీసులు కవాతు నిర్వహించారు.ఎన్నికల సమయంలో శాంతిభద్రతలు కాపాడడం, ఓటర్లలో భద్రతా భావన పెంపొందించడం లక్ష్యంగా ఈ కవాతు చేపట్టారు. పోలీస్ అధికారులు గ్రామ వీధుల గుండా కవాతు నిర్వహిస్తూ ప్రజలకు పలు సూచనలు చేశారు.ఎన్నికల సమయంలో ఎలాంటి అక్రమాలకు, ప్రలోభాలకు, బెదిరింపులకు లోనుకావద్దని, ఏవైనా అనుమానాస్పద ఘటనలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని, చట్టాన్ని అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామస్తులు కూడా పోలీసులకు సహకరించి శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరగేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ సీఐ చరమంద రాజు, ఎస్ఐ మోహన్ బాబు సహా పలువురు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >
జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్
Posted On 2026-08-01 16:47:06
Readmore >
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్పోస్ట్ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >